టీఎస్ఆర్టీసీలో విజిలెన్స్ అధికారులు అర్ధరాత్రి నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు కార్మికులను పీడిస్తున్నాయని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. విశ్రాంతి తీసుకునే వేళలలో సిబ్బందిని ఇబ్బంది పెడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షించి, కేసులు బనాయిస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. వెల్ఫేర్ బోర్డు సమావేశంలో యాజమాన్యం కార్మిక సంఘాలపై వ్యతిరేకత చూపించిందని.. ఇది నిరంకుశ విధానాలను చూపుతుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని, కార్మికుల భయాందోళనలు తొలగించి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.