ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసుకున్న దాదాపు 5 వేలకు పైగా రైతులకు గత మూడు నెలలుగా పట్టాదారు పాసుపుస్తకాలు అందడం లేదు. ఈ జాప్యం వల్ల రైతులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆలస్యమైనా పాసుపుస్తకాలు అందరికీ తపాలా ద్వారా సరఫరా అవుతాయని.. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని కొల్లాపూర్ ఆర్డీవో భన్సీలాల్ హామీ ఇచ్చారు.