ఏపీలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్లో ఉద్యోగ అవకాశాలపై గుంటూరు జిల్లాలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.