AP DSC 2026 Notification: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సిద్ధమైంది. ఫిబ్రవరి మొదటి వారంలో సుమారు 2,500 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పదవీ విరమణలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటుతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈసారి డీఎస్సీ పరీక్షలో ఆంగ్లం, కంప్యూటర్ అవగాహనపై అదనపు పేపర్లు ఉండనున్నాయి. ఈ మార్పులతో విద్యావ్యవస్థ నాణ్యత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.