తెలంగాణ ప్రభుత్వం కేరళ నమూనాలో పేదరిక నిర్మూలనకు వినూత్న కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆర్థికంగా ఆదుకునేందుకు 'ప్రజా భాగస్వామ్య' పద్ధతిలో సర్వే నిర్వహిస్తున్నారు. పారదర్శకతతో అర్హులను ఎంపిక చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు.