నీ ఆరోగ్యం బాగా లేకుంటే.. కూతురు ఏం పాపం చేసిందమ్మా..

3 hours ago 1
హైదరాబాద్ నగరంలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో ఓ తల్లి తన నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి చంపి.. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురు మృతి చెందగా.. తల్లిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఈ దారుణమైన చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొన్న గాజులరామారంలో ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఇది జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article