తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్మించిన నీరా కేఫ్ను.. ఎక్సైజ్, పర్యాటక శాఖ నుంచి కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే.. నీరా కేఫ్ నిర్మించిన భూమి పర్యాటక శాఖదే కావటంతో.. వచ్చే ఆదాయంలో 30 శాతం టూరిజం డిపార్ట్ మెంట్కు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.