GVMC Mobile Water Testing Lab: విశాఖపట్నం వాసులకు జీవీఎంసీ శుభవార్త చెప్పింది. ఏపీలోనే తొలిసారిగా విశాఖలో మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి వచ్చింది. ఇంటి వద్దనే నీటి పరీక్షలు చేసేలా ఈ ల్యాబ్ సాయంతో వీలు కలగనుంది. మరోవైపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు ఉపయోగించి 40 లక్షలు ఖర్చుచేసి ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి తెచ్చారు.