నెదర్లాండ్స్ దేశంలో శ్రీవారి ఆలయం నిర్మించనున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం ఏకంగా 33.5 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే నెదర్లాండ్స్లోని ఎన్నారైల సంఘం.. ఈ ఆలయ నిర్మాణానికి ఏకంగా రూ.250 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆలయ నిర్మాణం కోసం టీటీడీ సహకారం అందించనుంది.