శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కావలి మండలంలో ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ప్రతిపాదనలు చేసింది. ఈ నేపథ్యంలో కావలి మండలంలో భూసేకరణ కోసం కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే భూసేకరణపై కావలి మండలంలోని చెన్నాయపాలెంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో అధికారులు ప్రకటించిన రూ.20 లక్షల ప్యాకేజీని రైతులు తిరస్కరించారు. తమకు వ్యవసాయం, చేపల వేటే జీవనాధారమని.. ఇంత తక్కువకు భూములు ఇచ్చేస్తే తమ బతుకేంటని వారు ప్రశ్నిస్తున్నారు.