Two Young Men Burned Alive In Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం చుట్టూ విద్యుత్ తీగలతో ఏర్పాటు చేసిన కంచె తగలడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు రైతుపై కేసు నమోదు చేశారు. మరోవైపు, నాయుడుపేటలో మద్యం వ్యాపారుల నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో ఒక సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.