తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. మూడో దశలో 53 లక్షలకు పైగా ఓటర్లు 3,752 సర్పంచి పదవులకు, 28,410 వార్డులకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. తొలి రెండు దశల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధికంగా విజయం సాధించడంతో, తుది దశ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.