Chandrababu Naidu Dubai Tour: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. సీఎం దుబాయ్, అబుదాబి, లండన్ లలో పర్యటించనున్నారు. ఇవాళ చంద్రబాబు మూడు దేశాలల్లో పర్యటనకు వెళుతున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ పర్యటనలు దోహదపడతాయని భావిస్తున్నారు.