తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని.. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలు, అవినీతిపై విచారణ చేయిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ (BRS) నేతల అవినీతిపై 'టెస్ట్ మ్యాచ్' ముందుందని హెచ్చరించారు. ముఖ్యంగా.. ఉస్మాన్ కుంట చెరువు ఆక్రమణలో మాధవరం కృష్ణారావు ప్రమేయం ఉందని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ నోటీసులు పంపుతానని.. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చారు.