తనను గుంపు మేస్త్రీ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను గుంపు మేస్త్రీనే అని తేల్చి చెప్పారు. తన గుంపే తనకు బలమని, ప్రతిష్ఠ అని పేర్కొన్నారు. కొందరు మాత్రం తాము దొరలు అని గొప్పలు చెప్పుకుంటారని విమర్శలు గుప్పించారు. తనకు సార్ అని పిలిపించుకోవడం కన్నా.. అన్నా అని పిలిపించుకోవడమే ఇష్టమని పేర్కొన్నారు.