రాజకీయ నేతలపై ఉండే కేసుల విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై 23 కేసులు ఉన్నాయని అవే ఎక్కువ అని అనుకునేవాడిని అని గుర్తు చేసుకున్న లోకేష్.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 96 కేసులు ఉన్నాయని చెప్పారు. ఇక కేంద్రమంత్రి బండి సంజయ్పై 107 కేసులు ఉన్నాయని.. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.