Tadepalligudem mla Bolisetti srinivas comments: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే బాగుండని, తనతో ఉన్నవాళ్లే కోరుకుంటున్నారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారని అన్నారు. తాను చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే కావాలనుకోవటం పర్లేదు కానీ.. బతికున్నప్పుడే చనిపోవాలని కోరుకోవటం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యేను కాలేదన్న బొలిశెట్టి శ్రీనివాస్.. ప్రజామోదంతోనే నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ దక్కిందని చెప్పుకొచ్చారు.