బైబిల్, ఖురాన్, భగవద్గీత వల్ల దళితుల బతుకులు బాగుపడలేదని, కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తలరాతలు మారాయని మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై వీహెచ్పీ సహా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, తాను ఏ మత గ్రంథాన్ని అవమానించలేదని ఆయన తాజాగా స్పష్టం చేశారు. కేవలం రాజ్యాంగం గొప్పదనం గురించి మాత్రమే చెప్పానని మడకశిర ఎమ్మెల్యే తాజాగా వివరణ ఇచ్చారు.