తన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మనసు బాధ కలిగి ఉంటే ఆ కామెంట్లను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. సోమవారం సభలో రన్నింగ్ కామెంట్రీ చేస్తుండటంతో తాను అందర్నీ ఉద్దేశించి అలా అనాల్సి వచ్చిందన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి కాదని చెప్పారు.