తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు నెరవేరలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి దోపిడీ చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, తన కుమారుడి జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.