ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ప్రజలకు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. సహాయం అవసరమైన వారు కంట్రోల్ రూములలో ఏర్పాటుచేసిన ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.