తెలంగాణలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15వ తేదీ నాటికి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించారు.