కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక కుగ్రామానికి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసభ్యకరమైన పేరు దశాబ్దాలుగా అవమానాన్ని మిగిల్చుతోంది. సుమారు 150 కుటుంబాలు నివసించే ఈ గ్రామానికి 'నందిగూడ'గా పేరు మార్చుకున్నా.. కీలకమైన రెవెన్యూ దస్త్రాల్లో పాత పేరే కొనసాగుతోంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అసెంబ్లీలో ప్రస్తావించినా.. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.