భూ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన బాధితుడి నుంచి మద్యం బాటిళ్లు డిమాండ్ చేసిన మీర్పేట ఎస్సై నాగభూషణం వ్యవహారం సంచలనంగా మారింది. 11 గజాల స్థలం వివాదంలో న్యాయం చేయాల్సింది పోయి.. ఫోన్ చేసి మరీ మద్యం పంపాలని ఒత్తిడి చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికారి ఇలాంటి చర్యకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్.. ఆయనను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.