హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తన నూతన సంవత్సర వేడుకలను సేవా దృక్పథంతో వినూత్నంగా జరుపుకున్నారు. కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి.. అక్కడ ఉన్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే.. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలకు పరిమితం చేయవద్దని, వారికి కావాల్సింది పిల్లల ప్రేమేనని హితవు పలికారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.