ధరల దగాతో సతమతమవుతున్న రైతులకు ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక మోడల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం ఐవోటీ, ఏఐ వంటి సాంకేతికతతో పంటల సాగు నుంచి క్రయవిక్రయాల వరకు రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి, డిమాండ్కు అనుగుణమైన సాగును ప్రోత్సహిస్తుంది.