గణపతి నవరాత్రోత్సవాల తొలి రోజే ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండగ వేళ.. ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. వారిలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు యువకుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.