ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీపావళి పండగ దాదాపుగా ప్రారంభం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పండగ సీజన్లలో రైళ్లలో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బాణసంచా, పేలుడు పదార్థాలను రైళ్లలో తీసుకువెళ్లవద్దని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఒకవేళ ఇలాంటి వస్తువులతో ఎవరైనా ప్రయాణికులు పట్టుబడితే వారికి రూ.1000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించనున్నట్లు తెలిపారు.