ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు. అయితే అలా ఫోన్లను ట్యాప్ చేయాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి. తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో పీసీసీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిఘా కార్యకలాపాలు చట్టబద్ధంగా ఉండేలా ఈ కొత్త నిబంధన దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.