ఏపీలోని పత్తి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి (బుధవారం) పత్తి సేకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనునున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తుపాను గురించి రైతులు భయపడవద్దన్న అచ్చెన్నాయుడు.. ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుందని భరోసా ఇచ్చారు.