తెలంగాణలో పత్తి కొనుగోళ్ల అడ్డంకులు తొలగిపోయాయి. మిల్లర్ల అభ్యంతరాలపై సీసీఐ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి టెండర్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఈ నెల 22 లేదా 23 నుండి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల కష్టాలు తీరనున్నాయి.