రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత మార్కులు తక్కువగా రావడం, ఫెయిల్ అయితే పలువురు విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున ముందుగానే వారిని సజ్జనార్ అలర్ట్ చేశారు. రిజల్స్ట్ ఎలా ఉన్నా.. పిల్లలను ఏమీ అనవద్దని.. మార్కులే జీవితం కాదని తేల్చి చెప్పారు.