మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో తెలంగాణ విద్యాశాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో సెంటర్లు ఉన్న చోటనే వర్తిస్తుంది. ఈ సెంటర్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.