పదో తరగతి పరీక్షల్లో 600 గానూ 560 మార్కులు.. డిస్టిక్షన్లో పాస్.. స్నేహితుల దగ్గర నుంచి ప్రశంసలు.. పాఠశాల విద్య పూర్తైంది. కళాశాలలో చేరే టైమొచ్చింది. తండ్రి కూడా ఇంటర్మీడియట్ కాలేజీల్లో చేర్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలోనే తండ్రి నుంచి ఓ మందలింపు.. పదో తరగతిలో మార్కులు తక్కువగా వచ్చాయన్న మాట.. ఆ బాలిక ఈ మాటను భరించలేకపోయింది. మనస్తాపం చెంది కఠిన నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా పట్టాభిపురంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.