బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ట్వీట్ చేశారు. పదే పదే తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొన్ని ఛానెళ్లు, పేపర్లు, యూట్యూబ్ ఛానళ్లు.. తాను బీజేపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నానంటూ కథనాలు రాస్తున్నాయని.. అదంతా తప్పు అని ఖండించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని తేల్చి చెప్పేశారు.