ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంపరాఫర్ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు 3 సెంట్ల చొప్పున భూమిని ఇస్తానని సుధీర్ రెడ్డి ప్రకటించారు. జస్మిత(598), సాయి పూజిత (594),మోహిత్ చరణ్(591)కు ఈ నజరానాను అందజేయనున్నారు.