రాజధాని అమరావతిలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. పెనుమాక రైతుల భూములను పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను అడ్డుకోవటం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున పెనుమాక రైతులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం తమ భూములను సేకరిస్తోందని మండిపడ్డారు. తమ భూముల పరిశీలన కోసం వచ్చిన వారిని అడ్డుకోవటం దారుణమని మండిపడ్డారు. అవసరమైతే జగన్ను తమ గ్రామానికి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.