డీజీపీ సీవీ ఆనంద్పై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కానిస్టేబుల్ను కేవలం సస్పెండ్ చేసి వదిలేయడం సరికాదని మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనలాంటి ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డీజీపీ కుటుంబంలోని మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇదే విధంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు.