హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు మొదలైన రెండో రోజే ఊహించని ఘటన జరిగింది. రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాసి.. తన సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు కింద పడటంతో.. విద్యార్థిని అక్కడకిక్కడే ప్రాణాలు వదిలింది. విద్యార్థిని సోదరునికి తీవ్ర గాయాలయ్యాయి.