దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ దళాల విన్యాసాలు, బ్యాండ్ మేళాలతో భారత రాజ్యాంగ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ వేడుకలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించాయి.