పర్యాటకులకు శుభవార్త.. దేశంలో అతి పొడవైన విశాఖ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం, ఫుల్ థ్రిల్

3 months ago 6
Visakhapatnam Glass Bridge: విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. రూ. 7 కోట్లతో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తుఫాన్‌లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 ఎంఎం మందం గల జర్మన్ గ్లాస్‌తో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ గాజు వంతెన 500 టన్నుల బరువును మోయగలదు. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
Read Entire Article