Karampudi Beeruva Theft: వేసవి తాపం పెరగడంతో పాటు దొంగల బెడద కూడా ఎక్కువైంది. పల్నాడు జిల్లాలో ఓ వింత చోరీ జరిగింది. కాకానివారిపాలెంలో నిమ్మగడ్డ రాఘవయ్య ఇంట్లో బీరువాను దొంగలు ఎత్తుకెళ్లి పొలంలో పగులగొట్టారు. 40 గ్రాముల బంగారం, రూ.10 వేలు అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు చోరీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.