గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం టి-ఫైబర్ ద్వారా కోటి ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నామన్నారు. మారుమూల గ్రామాల్లోనూ సిలికాన్ వ్యాలీ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. టి-ఫైబర్ ప్రాజెక్ట్ విద్య, వైద్యం, వ్యాపారం, ఈ-గవర్నెన్స్ సేవలను ప్రజలకు చేరువ చేయనుంది.