ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పుట్టపర్తిలో రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్లు అదనంగా కేటాయించారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు రావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వేడుకలలోపు పుట్టపర్తిలో రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ.30 కోట్లు అదనంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.