ఉప్పాడ మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. వంద రోజుల ప్రణాళికను ప్రకటించిన పవన్ కళ్యాణ్.. అందుకు అనుగుణంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఉప్పాడ మత్స్యకారులకు కేరళ, తమిళనాడుల్లో శిక్షణ ఇప్పించారు. తమిళనాడు వెళ్లిన బృందానికి కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థలపై శిక్షణ అందించారు. అలాగే కేరళలో మోడల్ ఫిషింగ్ హార్బర్, అత్యాధునిక వలల తయారీపై ట్రైనింగ్ ఇచ్చారు.