Ka Paul Comments On Pawan Kalyan: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా 'బీ-టీమ్'గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపోయారని పాల్ తెలిపారు.