ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యా్ఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని నేపాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన మంచి వాతావరణం ఉన్న పరిస్థితులలో ఆ మాటలను ఇలా వక్రీకరించవద్దని కోరింది. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.