ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే భేటీ అయ్యారు. బుధవారం రోజున సచివాలయంలో పవన్ కళ్యాణ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదుచేశారు. సదుంలో మైనింగ్ కోసం మధ్యప్రదేశ్ వాసులకు అనుమతులు లభించాయని.. కానీ కొంతమంది మైనింగ్కు అడ్డుతగులుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పవన కళ్యాణ్ హామీ ఇచ్చారు.