ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇంఛార్జిగా అత్తి సత్యనారాయణను తిరిగి నియమించారు. థియేటర్ల బంద్ వార్తల సమయంలో అత్తి సత్యనారాయణ మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో ఇంఛార్జి పదవి నుంచి అత్తి సత్యనారాయణను తొలగించారు, తాజాగా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేన ఇంఛార్జిగా అత్తి సత్యనారాయణను మళ్లీ నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.