హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా నెట్వర్క్ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. ఇటుకల బట్టీ కూలీ నుంచి కింగ్ పిన్గా మారిన మురుగన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి 25 మంది పిల్లలను విక్రయించినట్లు తేలింది. ఈ దారుణానికి సహకరిస్తున్న కూకట్పల్లి, సికింద్రాబాద్లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాఫియాతో చేతులు కలిపిన డాక్టరు, మధ్యవర్తుల కోసం విచారణ ముమ్మరం కావడంతో నగరంలో కలకలం రేగుతోంది.